నల్లగొండ : నల్లగొండలోని పీటీఆర్ కాలనీలో తుంగతుర్తి టీఆర్ఎస్ ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ తండ్రి మారయ్య చిత్రపటానికి సీఎం కేసీఆర్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కిశోర్ కుటుంబ సభ్యులను కేసీఆర్ పరామర్శించారు. మారయ్యకు నివాళులర్పించిన వారిలో మంత్రులు హరీశ్రావు జగదీశ్ రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ఉన్నారు. మారయ్య గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. నల్లగొండకు సీఎం కేసీఆర్ రోడ్డుమార్గాన వెళ్లారు.