CM KCR | హైదరాబాద్ : తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలు, వీరనారి చాకలి ఐలమ్మ 38వ వర్ధంతి సందర్భంగా ఆమె సేవలను సీఎం కేసీఆర్ స్మరించుకున్నారు. తెలంగాణ బహుజన చైతన్యానికి, మహిళా శక్తికి చాకలి ఐలమ్మ ప్రతీక అని పేర్కొన్నారు.
సాయుధ ఉద్యమ సమయంలో ఐలమ్మ చూపి ధైర్య సాహసాలు ఎనలేనివి అని గుర్తు చేశారు. ప్రతి ఏడాది ఐలమ్మ జయంతి, వర్ధంతి కార్యక్రమాలు అధికారికంగా నిర్వహిస్తామన్నారు. తెలంగాణ పోరాట యోధులను ప్రభుత్వం సమున్నతి రీతిలో స్మరించుకుంటుంది. సబ్బండ వర్గాల సంక్షేమం, మహిళా అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. రాష్ట్ర సంక్షేమ, అభివృద్ధిలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని కేసీఆర్ పేర్కొన్నారు.