హైదరాబాద్, డిసెంబర్ 18 (నమస్తే తెలంగాణ): సూర్యాపేట జిల్లా తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్ తండ్రి మారయ్య మృతిపట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. మారయ్య మృతి పట్ల టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ దిగ్భ్రాంతికి గురయ్యారు. మారయ్య ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, మంత్రులు హరీశ్రావు, జగదీశ్రెడ్డి, నిరంజన్రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతిరాథోడ్, పువ్వాడ అజయ్, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, ఇంద్రకరణ్రెడ్డి, వేముల ప్రశాంత్రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్గౌడ్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్కుమార్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, మండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి తదితరులు సంతాపం తెలిపారు.