మేడ్చల్ మల్కాజిగిరి : ముఖ్యమంత్రి కేసీఆర్ది దేశంలోనే ఆదర్శవంతమైన పాలన అని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. ఉమ్మడి శామీర్పేట మండలంలోని అలియాబాద్, జగ్గంగూడ, కొల్తూర్, పోతారం, ఉద్దెమర్రి, కేశ్వాపూర్ గ్రామాల్లో రూ.70 లక్షలతో సీసీ రోడ్లు, అండర్గ్రౌండ్ డ్రైనేజీ పనులకు గురువారం భూమి పూజ చేశారు. పోతారం గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు.
లబ్ధిదారులకు షాదీముబారక్, కల్యాణలక్ష్మి చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణలో అన్ని వర్గాల అభివృద్ధి కోసం సీఎం కృషి చేస్తున్నారని తెలిపారు. తండాలు, అనుబంధ గ్రామాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేయడంతో పాటు నేడు శాశ్వత భవనాల కోసం రూ.25 లక్షలు మంజూరి చేస్తున్నట్లు వివరించారు.
మన ఊరు- మన బడి కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి రూ.7 వేల కోట్లను ప్రభుత్వం కేటాయించిందన్నారు. మొదట విడతలో కొన్ని పాఠశాలల్లో పనులు జరుగుతున్నట్లు తెలిపారు. దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలు ఉన్నత చదువులు చదువుకోవాలని 900ల గురుకుల పాఠశాలలను ప్రారంభించారన్నారు.
కార్యక్రమంలో డీసీఎంఎస్ వైస్ చైర్మన్ మధుకర్రెడ్డి, జడ్పీటీసీ అనిత, ఎంపీపీలు ఎల్లు బాయి, హారిక, వైస్ ఎంపీపీ సుజాత, ఏఎంసీ వైస్ చైర్మన్ శ్రీకాంత్రెడ్డి, సర్పంచ్లు కుమార్యాదవ్, విష్ణువర్ధన్రెడ్డి, మోహన్రెడ్డి, హరిమోహన్రెడ్డి, జామ్ రవి, ఆంజనేయులు, గోపినాయక్, రాంచంద్రయ్య, నర్సింహారెడ్డి, శిల్పయాదగిరి, ఎంపీటీసీ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.