CM KCR | కేంద్రం వ్యవహరిస్తున్న తీరుపై రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ధ్వజమెత్తారు. అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాల్లో భాగంగా అసెంబ్లీలో జరిగిన చర్చల అనంతరం సీఎం కేసీఆర్ సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘చాలా చిత్రవిచిత్రమైన పోడకలు, వింత వింత ధోరణలు చూస్తున్నాం. ఎందుకు జరుగుతున్నయ్? అని ఆలోచించాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉంటుంది. ప్రజాస్వామ్య, జాతి నిర్మాణరంగంలో పనిచేసే ప్రతి ఒక్కరూ తీవ్రంగా ఆలోచించాలని ప్రార్థిస్తున్నా. దేశంలో చెలరేగుతున్న ధోరణలు, ప్రజల ఆలోచనలు, నెరవేర్చుతున్న, నెరవేర్చబడుతున్న, మిగిలిపోయిన ప్రజల ఆకాంక్షలు, ఆశలు.. మధ్య మధ్యలో చెలరేగే ప్రజల ఆకోశ్రాలు వీటన్నింటి సమహారంగా ప్రజాజీవితంలో ధీర్ఘమైన, తీవ్రమైన చర్చ జరుపాల్సి ఉంటుంది. అలాంటి చర్చలకు వేదికనే దేవాలయంలాంటి శాసనసభ అని భావిస్తున్నా. దురదృష్టవశాత్తు జబ్బలు చరుచుకుంటూ సబ్జెక్ట్ వదిలి మరోటి మాట్లాడాడు రకరకాల పెడధోరణులు శాసనసభలో, పార్లమెంట్లో కనిపించడం బాధాకరం. 75 సంతంత్ర దేశంలో ఈరోజుకు విచిత్రమైన ధోరణులు, పక్షపాత వైఖరులు ఎందుకు కనిపించాల్సి వస్తుందో ఆలోచించాలి’ అని పిలుపునిచ్చారు.
‘ఎప్పటిలాగే బడ్జెట్లో కేంద్రం అన్యాయం చేసింది. బడ్జెట్ చదివిన వారందరికీ తెలుసు. దేశంలో 157 మెడికల్ కాలేజీలు ఇస్తే.. తెలంగాణకు ఒక్కటీ రాదు. దీన్ని ఏమనుకోవాలి ? ప్రజాస్వామ్యమా? ఫెడరలిజం అంటారా? కోపరేటివ్ అంటే ఇదే అనుకోవాలా? మళ్లీ 157 నర్సింగ్ కాలేజీలు మంజూరు చేస్తామని చెబితే.. ఇందులో ఒక్కటీ రాష్ట్రానికి రాదా? ఇది దేనికి సంకేతం? తెలంగాణనే కాదు ఎవరిపట్ల జరిగినా సరికాదు. ఆంధ్రప్రదేశ్ విభజన జరిగింది. రూ.495కోట్లు తెలంగాణకు రావాల్సింది ఏపీ ఖాతాలో వేయించాలంటే కేంద్రాన్ని అడగవట్టి ఏడేళ్లు అవుతుంది. ఏడు సంవత్సరాల నుంచి అడిగిఅడిగి అరిగిపోయిన రికార్డులా మారింది. గిరిజన యూనివర్సిటీ కూడా రాలేదు. ఏలా ఉందంటే.. ఉల్టా ఇవ్వంగాక ఇవ్వం అన్నట్లుంది. ఎనకటికి కిరణ్కుమార్ రెడ్డి అనే ముఖ్యమంత్రి ఉండే సభలో. ఇదే రాజేందర్, ఇదే హరీశ్రావు తెలంగాణ నిధులేవి అడిగితే.. మీరు ఎక్కతక్క మాట్లాడితే పైసాకూడా ఇవ్వం ఏం చేసుకుంటో అన్నడు. అంతమితిమీరి ఎవరైనా అహంకారపూరితంగా, ఈ నిమిషానికి మా చేతుల్లో అధికారం ఉంది.. మేమే కర్తలం, మేమేదర్తలం.. మేం ఏదైనా చేయగులుగుతాం అనే పద్ధతి ప్రజాస్వామ్యానికి స్ఫూర్తి, మంచిది కాదు. దీన్ని ఎవరూ మెచ్చుకోరు’ అన్నారు.
‘మాటలు కోటలు దాటిపోతున్నయ్. ఉపన్యాసం వింటే మైకులు పగిలిపోయి రెండురెండు గంటలు.. మూడు మూడు గంటలు భయంకరమైన కథ. వెనక్కి మళ్లి చూస్తే మంచినీళ్లు దిక్కులేదు. సాగునీరు దిక్కులేదు, కరెంటు దిక్కులేదు అంతాగంటే. దేశ రాజధాని ఢిల్లీలో మంచినీళ్లు దిక్కులేవు. మంచినీళ్లు, సాగునీరు, కరెంటు ఉండదు వెరసి మన భారతదేశ చరిత్ర. అమెరికాలో ఎవరికైనా గ్రీన్కార్డు దొరికితే పిల్లల తల్లిదండ్రులు ఇక్కడ పిలిచి పార్టీలు ఇస్తున్నారు. బీజేపీ అధికారం చేపట్టిన నాటి నుంచి నేటి వరకు 20లక్షల మంది భారతీయులు ఇండియన్ సిటిజన్ షిప్ను వదులుకున్నారు. ఎందుకు వెళ్తున్నరు దేశం నుంచి ? ఉన్న ఊరు.. కన్న వారిని వదిలిపెట్టి ఎందుకు వెళ్తారు? సక్కదనం ఉంటే ఎందుకు వెళ్లాల్సి వస్తుంది. సిటిజన్ షిప్ వదులుకునే దౌర్భాగ్యం ఏందీ? వేరే దేశంలో పౌరసత్వం దొరికితే ఇక్కడ దావత్లు చేసుకునే దౌర్భాగ్యం ఏందీ? దేశంలో భయంకరమైన పరిస్థితులున్నయ్’ అంటూ మండిపడ్డారు.