హైదరాబాద్ : కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. మందికి పుట్టిన బిడ్డను మా బిడ్డ అని బీజేపీ వాళ్లు ముద్దాడుతారు అని కేసీఆర్ విమర్శలు గుప్పించారు. ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. ఇక కేసీఆర్ను పట్టుకోని వెయ్యి తిట్లు తిడుతారు. ఈ దొంగ ముఖం గాళ్లు. వీళ్లు దరిద్రులు. బీజేపీని కూకటివేళ్లతో పీకి అవతల పడేయాలి.
చినజీయర్ స్వామి రామానుజాచార్యుల విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. తమిళనాడులో ఈ విగ్రహాన్ని నెలకొల్పాలని చినజీయర్ స్వామి అనుకున్నారు. కానీ అక్కడ కొండ ప్రాంతం దొరక్కపోవడంతో.. ముచ్చింతల్లో జాగ ఇచ్చారు. మైహోం రామేశ్వర్ రావు వంద ఎకరాలు ఇచ్చారు. అక్కడ హోమియోపతి మెడికల్ కాలేజీ ఉంది. ఇప్పుడు దాన్ని హోమియోపతి యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నారు. ధార్మిక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. రామానుజాచార్యుల వారు హిందూ మతంలో విప్లవం తీసుకొచ్చారు. జీయర్ స్వామి చెమటోడ్చి సమతామూర్తి విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నారు. ఆ సమతామూర్తి విగ్రహం ఏర్పాటు కోసం పదేండ్ల నుంచి శ్రమిస్తున్నారు. ఏ ఒక్క బయటి వ్యక్తి కూడాపైసలు ఇవ్వలేదు. బీజేపీ దాని అనుబంధ సంస్థలు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. యూపీ ఎన్నికల ప్రచారంలో సమాతామూర్తి విగ్రహం ఘనత బీజేపీదే అని చెబుతున్నారు. హిందీలో పోస్టులు పెట్టారు బీజేపీ వ్యక్తులు. ఇంతకన్నా దారుణం ఏం ఉండదన్నారు. ఎన్నికలు అనగానే బీజేపీ మత రాజకీయాలు చేస్తోందని సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.