హైదరాబాద్: రాష్ట్రంలో వీరశైవ లింగాయత్ ల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం పాటుపడుతున్నదని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు తెలిపారు. మహాత్మ బసవేశ్వరుని జయంతి సందర్భంగా వీరశైవ లింగాయత్ లకు ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. మనుషుల నడుమ అసమానతలను పెంచే కుల, వర్ణ, లింగ వివక్షతలను వ్యతిరేకించిన బసవేశ్వరుడు అభ్యుదయవాదిగా, పాలనాదక్షుడుగా నాటి కాలంలో పేరొందారన్నారు.