హైదరాబాద్, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ)/ హుజూరాబాద్ టౌన్: టీఆర్ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్యాదవ్ తన పుట్టినరోజు సందర్భంగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావును కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. శనివారం హైదరాబాద్లోని ప్రగతి భవన్లో తనను కలిసిన గెల్లు శ్రీనివాస్యాదవ్కు సీఎం కేసీఆర్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నికలో ఘన విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ గెల్లు శ్రీనివాస్యాదవ్కు రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ ట్విట్టర్ ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎంపీ సంతోష్కుమార్ పిలుపు మేరకు గ్రీన్ ఇండియా చాలెంజ్ స్వీకరించి హైదరాబాద్లోని తన ఇంటి ఆవరణలో గెల్లు శ్రీనివాస్ యాదవ్ మొక్క నాటారు. పర్యావరణ పరిరక్షణకు అందరూ మొక్కలు నాటాలని ఆయన విజ్ఞప్తి చేశారు.