కరీంనగర్, జనవరి 16 (నమస్తే తెలంగాణ): కరీంనగర్ శివారులోని మానేరు తీరంలో ఉన్న ఓ ఫంక్షన్ హాల్లో పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తండ్రి మల్లయ్య ద్వాదశ కర్మ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు గంగుల మల్లయ్య చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా మంత్రి గంగులను దగ్గరకు తీసుకొని ఓదార్చారు. ఆయన కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. సీఎం వెంట మంత్రులు కొప్పుల ఈశ్వర్, వేముల ప్రశాంత్రెడ్డి, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్, రాజ్యసభ సభ్యుడు దీవకొండ దామోదర్రావు, జోగినపల్లి సంతోష్కుమార్, ఎమ్మెల్సీ ఎల్ రమణ, ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, వొడితల సతీశ్కుమార్, డాక్టర్ ఎన్ సంజయ్కుమార్, సుంకె రవిశంకర్, కోరుకంటి చందర్, దాసరి మనోహర్రెడ్డి తదితరులు ఉన్నారు.