హైదరాబాద్ : ఆరోగ్యశ్రీ ట్రస్ట్ (Arogyashri Trust) చైర్మన్గా నియమితులైన మాజీ ఎమ్మెల్యే ప్రొఫెసర్ డాక్టర్ ఎన్. సుధాకర్రావు ముఖ్యమంత్రి కేసీఆర్( CM KCR) ను ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. తనకు చైర్మన్గా అవకాశం ఇచ్చినందుకు కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సుధాకర్రావుకు సీఎం శుభాకాంక్షలు తెలిపారు. ఆయన వెంట రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Minister Errabelli Dayakar rao), మాజీ ఉప ముఖ్య మంత్రి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, ఎమ్మెల్యే రెడ్యానాయక్ తదితరులు ఉన్నారు.