వరంగల్ : తెలంగాణ ప్రజల 60 ఏండ్ల కలను నిజం చేసిన మహానుభావుడు కేసీఆర్ అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కొనియాడారు. సీఎం కేసీఆర్ తెలంగాణ గాంధీ అని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని పాలకుర్తి నియోజకవర్గంలో మంత్రి దయాకర్ రావు సుడిగాలి పర్యటనలు చేశారు. పాలకుర్తిలోని ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు. అనంతరం దేవరుప్పులలో అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి దయాకర్ రావు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ పుట్టిన రోజు అంటే మనందరికీ పుట్టిన రోజు అని చెప్పారు. కేసీఆర్ పుట్టిన రోజును మనమంతా పండుగలా చేసుకోవాలన్నారు. తెలంగాణ గాంధీ సీఎం కేసీఆర్ గ్రామాలను అభివృద్ధి చేస్తున్నారు. ఇవాళ తెలంగాణ పల్లెలన్నీ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. పల్లెప్రగతి కార్యక్రమంతో ఇవాళ పల్లెలన్నీ పచ్చగా, పరిశుభ్రంగా, స్వయం సమృద్ధిగా తయారయ్యాయని పేర్కొన్నారు.
మన అందరి బంధువు.. ఆత్మ బంధువు, పేదల పెన్నిధి, రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ సారథి సీఎం కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు ఘనంగా నిర్వహించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.