హైదరాబాద్, జూన్ 1 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ప్రకటించిన విధంగా, పద్మశ్రీ అవార్డు గ్రహీత కిన్నెరమెట్ల మొగులయ్యకు రూ.1 కోటి నగదు పురసారాన్ని మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
గతంలో మొగులయ్య కోరుకున్నట్టుగా బీఎన్రెడ్డి నగర్ కాలనీలో ఇంటి స్థలాన్ని కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 12 మెట్ల కిన్నెర వాయించటంలో నిష్ణాతుడైన మొగిలయ్య ప్రజా వాగ్గేయకారుడిగా అందరికీ సుపరిచితమే.