హైదరాబాద్, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ): తిరుమల తిరుపతి దేవస్థానం కొత్త చైర్మన్గా భూమన కరుణాకర్రెడ్డిని సీఎం జగన్మోహన్రెడ్డి ఎంపిక చేశారు. ఇప్పుడున్న చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, టీటీడీ బోర్డు పదవీకాలం ఈ నెల 8తో ముగియనున్నది.
ప్రస్తుతం తిరుపతి ఎమ్మెల్యేగా ఉన్న కరుణాకర్రెడ్డికి గతంలోనూ టీటీడీ చైర్మన్గా పనిచేసిన అనుభవం ఉన్నది. గత జూలైలో భూమనను సభాహక్కుల కమిటీ చైర్మన్గా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. తాజా నియామకంతో ఆయన రెండేండ్లపాటు టీటీడీ చైర్మన్గా బాధ్యతలు నిర్వర్తించనున్నారు.