హైదరాబాద్, డిసెంబర్ 28 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా ఉదయం వేళల్లో దట్టమైన పొగమంచు కురుస్తుండటంతో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. మరో రెండు రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో చిన్న పిల్ల లు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని వైద్యు లు సూచిస్తున్నారు. శీతాకాలంలో శ్వాస సంబంధ, ఊపిరితిత్తుల సమస్యలతో చర్మ సంబంధ వ్యాధులు అధికంగా వస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. టీబీ వ్యాధిగ్రస్థులు దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు బ్యాక్టీరియా బయటకు వస్తుందని, వాటిని పీల్చితే రోగ నిరోధక శక్తి తక్కువ ఉండే వ్యక్తులకు వ్యాధి వ్యాపించే ప్రమాదం లేకపోలేదని పేర్కొన్నారు. ఉష్ణోగ్రతలు వే గంగా తగ్గుతున్న తరుణంలో గుండెజబ్బు లు వచ్చే అవకాశం కూడా ఉన్నదని తెలిపా రు. చలికాలంలో జీవనశైలిని మార్చుకోవాలని సూ చించారు. వేడి పోషకాహార పదార్థాలు తీసుకోవాలని, మద్యం, సిగరెట్లకు దూరంగా ఉండాలని తెలిపారు. వృద్ధులు, చిన్నారులపై చలిగాలుల ప్రభావం తీవ్రంగా ఉంటుందని పేర్కొన్నారు. రెండేండ్లలోపు పిల్లలకు శ్వాస సంబంధ న్యుమోనియా, ఆస్తమా వస్తాయని, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
హైదరాబాద్ నగరంలో గురువారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రత 28.3 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 16.9 డిగ్రీలుగా నమోదైంది. గాలిలో తేమ 58 శాతంగా నమోదైనట్టు హైదరాబాద్ వాతావరణ కేం ద్రం అధికారులు తెలిపారు. రానున్న రోజు ల్లో చలి తీవ్రత పెరుగుతుందని పేర్కొన్నారు.
రాష్ట్రంలో రానున్న రెండురోజులపాటు రాత్రి ఉష్ణోగ్రతలు 15 డిగ్రీల కంటే తక్కువగా నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఈదురు గాలులతోపాటు గాలిలో తేమశాతం పెరగడంతో తెల్లవారుజామున దట్టమైన పొగమంచు కురుస్తున్నట్టు పేర్కొన్నారు. మంచిర్యాల, నిర్మల్, మహబూబాబాద్, నిజామాబాద్, నల్లగొండ, సూర్యాపేట, ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, సిద్దిపేట, యాదాద్రి-భువనగిరి, కామారెడ్డి, వరంగల్, హనుమకొండ, జనగామ, రంగారెడ్డి, మేడ్చల్- మల్కాజిగిరి జిల్లాల్లో మంచు తీవ్రత ఎక్కువగా ఉంటుందని తెలిపారు. హైదరాబాద్, మధ్య తెలంగాణలో చలి తీవ్రత కొంత పెరిగే అవకాశం ఉన్నదని పేర్కొన్నారు. తెలంగాణ వాయవ్య దిశలో కొంత వేడి ఉంటుందని వెల్లడించారు.