హైదరాబాద్, అక్టోబర్ 31 (నమస్తే తెలంగాణ) : న్యాయవాద కోర్సుల్లో ప్రవేశాల కౌన్సెలింగ్ నోటిఫికేషన్ మంగళవారం విడుదలకానున్నది. 2 నుంచి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఈ నెలలోనే కౌన్సెలింగ్, అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి చేస్తారు. 28 నుంచి తరగతులు ప్రారంభిస్తారు. ఈ ఏడాది 54 కాలేజీల్లో 5,296 సీట్లను కన్వీనర్ కోటాలో భర్తీచేయనున్నారు. ఎస్టీ రిజర్వేషన్ను 6 శాతం నుంచి పెంచిన 10శాతం కోటాను సీట్ల భర్తీకి వర్తింపజేస్తారు. సోమవారం టీఎస్ లాసెట్, పీజీ లాసెట్ అడ్మిషన్ల షెడ్యూల్ను ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆర్ లింబాద్రి విడుదల చేశారు. వివరాలకు https ://lawcetadm.tsche.ac.inను సంప్రదించాలని సూచించారు.