హైదరాబాద్, జనవరి 27 (నమస్తే తెలంగాణ): కానిస్టేబుల్ తుది ఫలితాల విడుదలపై త్వరలోనే క్లారిటీ రానున్నది. వచ్చేనెల మూడో వారంలోనే ఫలితాల విడుదల అంశం ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉన్నది. నిపుణుల కమిటీ వేయాలన్న రాష్ట్ర హైకోర్టు తీర్పుపై అసంతృప్తితో ఉన్న తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు (టీఎస్ఎస్పీఆర్బీ) ఇప్పటికే సుప్రీంకోర్టులో ఫలితాల విడుదలపై అప్పీల్కు వెళ్లింది. జరిగిన తప్పొప్పులపై సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవరిస్తూ, నిపుణుల కమిటీ వేయాలన్న తీర్పును సైతం సవాల్ చేసినట్టు విశ్వసనీయంగా తెలిసింది.
టీఎస్ఎల్పీఆర్బీ వేసిన అప్పీల్ సు ప్రీంకోర్టులో ఇంకా లిస్ట్ కాలేదని సమాచారం. కేసు హియరింగ్కు వస్తే.. ఫలితాల విడుదలపై ఒకట్రెండు వాయిదాల్లోనే క్లారిటీ వస్తుందని బోర్డు భావిస్తున్నది. ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ల నిపుణుల కమిటీ తుది నివేదికను సీల్డ్ కవర్లో హైకోర్టుకు సమర్పించినట్టు సమాచారం. దీంతోపాటు సుప్రీంకోర్టు తుది తీర్పుపైనా ఉత్కంఠ నెలకొంది.