హైదరాబాద్, మే 18 (నమస్తే తెలంగాణ): మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుడు ఎర్ర గంగిరెడ్డి బెయిల్ను జూన్ 30 వరకు రద్దు చేసి, తిరిగి జూలై 1న విడుదల చేయాలన్న తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ సారథ్యంలోని ధర్మాసనం విస్మయం వ్యక్తం చేసింది.
ఇవెక్కడి ఉత్తర్వులంటూ అసహనం వ్యక్తం చేస్తూ విచారణను వెకేషన్ బెంచ్కి బదిలీ చేసింది. దీంతో వచ్చేవారం ఈ పిటిషన్పై సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్ విచారణ జరపనున్నది.