హైదరాబాద్, ఫిబ్రవరి 9 (నమస్తేతెలంగాణ): ఉప్పల్లో స్టేడియంలో ఆదివారం జరిగిన మ్యాచ్లో హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్ (ప్రెసిడెంట్ లెవన్) జట్టుపై న్యాయమూర్తుల(ప్రధాన న్యాయమూర్తి లెవన్) జట్టు 93 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన సీజే లెవన్ జట్టు నిర్ణీత 16 ఓవర్లలో 167 పరుగులు చేసింది. ప్రెసిడెంట్ లెవన్ జట్టు 74 పరుగులకే ఆలౌట్ అయ్యింది. జస్టిస్ నర్సింగ్రావు నందికొండ, జస్టిస్ మధుసూధన్ రావు బౌలింగ్, బ్యాటింగ్ లో ప్రతిభ కనబరిచారు. జస్టిస్సురేందర్ మ్యాన్ఆఫ్ ది మ్యాచ్గా నిలిచారు. యాక్టింగ్ చీఫ్ జస్టిస్ సుజయ్పాల్మ్యాచ్ను ప్రారంభించారు. జస్టిస్ కే లక్ష్మణ్, జస్టిస్ మాధవి దేవి, జస్టిస్ ఎన్వీ శ్రావణ్ కుమార్, జస్టిస్ సీవీ భాసర్ రెడ్డి, జస్టిస్ శ్రీనివాస్రావు, హెచ్సీఏఏ అధ్యక్షుడు ఏ రవీందర్రెడ్డి, కార్యదర్శులు శాంతిభూషన్, సంజీవ్రెడ్డి, అదనపు కార్యదర్శి నవీన్ పాల్గొన్నారు.