హైదరాబాద్, మార్చి 9 (నమస్తే తెలంగాణ) : ఔత్సాహికులైన యువతను అత్యవసర సేవలకు వినియోగించుకునేందుకు తెలంగాణ అగ్నిమాపకశాఖ ‘సివిల్ డిఫెన్స్ వలంటీర్’ వ్యవస్థను తీసుకొచ్చిందని ఫైర్ డైరెక్టర్ జీవీ నారాయణరావు తెలిపారు. సోమవారం ఎంపికైన వలంటీర్లకు సైఫాబాద్ ఫైర్ సర్వీసెస్ కాలేజీలో శిక్షణ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అత్యవసర పరిస్థితులు, ముఖ్యంగా ఎయిర్ రైడ్స్, కెమికల్ దాడులు, న్యూక్లియర్ ప్రమాదాలు, ఇతర విపత్తుల సమయంలో వలంటీర్లు ప్రభుత్వ శాఖలకు సహకరించాలని కోరారు. ఈ శిక్షణలో వలంటీర్లకు రక్షణ, అగ్నిమాపక చర్యలు, ఫస్ట్ఎయిడ్, క్రౌడ్ కంట్రోల్ అంశాల్లో శిక్షణ ఇస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎఫ్వో బీ సుధాకర్రావు, ప్రిన్సిపల్ డీ కరుణసాగర్, వైస్ ప్రిన్సిపల్ పాల్గొన్నారు.