ప్రస్తుతం బాలీవుడ్తో పాటు దక్షిణాదిలోనూ పురాణాలు, ఇతిహాసాల్ని ఆధారంగా చేసుకొని సినిమాల్ని తెరకెక్కించే ట్రెండ్ పెరిగింది. తాజాగా సీత దృక్కోణం నుంచి రామాయణ గాథ ఔన్నత్యాన్ని ఆవిష్కరిస్తూ హిందీలో ఓ భారీ చిత్రాన్ని తెరకెక్కించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ‘సీత’ పేరుతో రూపొందనున్న ఈ చిత్రానికి ‘బాహుబలి’ రచయిత విజయేంద్రప్రసాద్ కథను అందిస్తున్నారు. రామాయణాన్ని కొత్త కోణంలో చర్చిస్త్తూ రూపుదిద్దుకోనున్న ఈ సినిమాలో సీత పాత్రను కరీనాకపూర్ పోషించనున్నట్లు వార్తలొస్తున్నాయి. కథతో పాటు తన పాత్రను తీర్చిదిద్దిన విధానం నచ్చడంతో ఆమె ఈ సినిమాను అంగీకరించిందని చెబుతున్నారు. రావణుడిగా బాలీవుడ్ అగ్రహీరో రణ్వీర్సింగ్ నటించబోతున్నారు. రణ్వీర్సింగ్, కరీనాకపూర్ కలయికలో రానున్న తొలి చిత్రమిదే కావడం గమనార్హం. అలౌకిక దేశాయ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు.