హైదరాబాద్, సెప్టెంబర్ 21 (నమస్తే తెలంగాణ) : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఈశా న్య మధ్యప్రదేశ్ పరిసర ప్రాంతాల వద్ద స్థిరంగా కొనసాగుతున్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాగల 48 గంటల్లో పశ్చిమ వాయవ్య దిశగా కదలనుందని, దీని ప్రభావంతో గురువారం ఆదిలాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని పేర్కొన్నది. ఈనెల 25 వరకు పలు ప్రాంతాల్లో మోస్తరు వానలు కురిసే వీలున్నదని తెలిపింది. కాగా, గడిచిన 24 గంటల్లో ఇరువైదు జిల్లాల్లో వర్షం కురిసింది. అత్యధికంగా కుమ్రంభీం జిల్లా దహేగాంలో 8.55 సెం.మీ. వర్షపాతం నమోదైంది.