శంషాబాద్ రూరల్, అక్టోబర్ 10: శంషాబాద్ ఎయిర్పోర్టులో అక్రమంగా తరలిస్తున్న బంగారంతోపాటు సిగరెట్ స్టిక్స్ను కస్టమ్స్ అధికారులు మంగళవారం పట్టుకున్నారు. బహ్రెయిన్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడిని తనిఖీ చేయగా మలద్వారం వద్ద దాచుకొని తెచ్చిన నాలుగు క్యాప్సూల్స్ బంగారం లభించింది. పట్టుబడిన 782 గ్రాముల బంగారం విలువ రూ.46.13 లక్షల ఉంటుందని అధికారులు తెలిపారు.
మస్కట్ నుంచి వచ్చిన మరో ప్రయాణికుడి వద్ద రెండు కట్ముక్కల బంగారం, గొలుసు లభించింది. దొరికిన 317 గ్రాముల బంగారం విలువ రూ.18.17 లక్షలు ఉంటుందని పేర్కొన్నారు. కంబోడియా నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికుల నుంచి 1,17,600 సిగరెట్స్ స్టిక్స్ స్వాధీనం చేసుకున్నారు. సిగరెట్ స్టిక్స్ విలువ రూ.11.6 లక్షల ఉంటుందని తెలిపారు.