హైదరాబాద్, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ) : డీజీపీ ఆఫీసుకు అటాచ్ అయిన డీఐజీ.. తన కొడుకు పేరుపై సుమారు 12 ఎకరాల భూమిని కొనుగోలు చేసినట్టు తెలిసింది. ఆ అధికారి అవినీతిపై దర్యాప్తు చేస్తున్న సీఐడీ, ఇంటెలిజెన్స్ అధికారులు ఈ విషయాన్ని నిగ్గు తేల్చినట్టు సమాచారం. 21 ఏండ్లు ఉన్న అతని కొడుకు పేరున దేవకరద్రలో ఈ భూమిని కొనుగోలు చేసినట్టు తెలిసింది.
కాగా ఆ అధికారి అవినీతిపై కొన్నిరోజులుగా విచారిస్తున్న అధికారులు.. తుది నివేదికను సీఐడీ డీజీ ద్వారా ప్రభుత్వానికి పంపనున్నట్టు సమాచారం. వారు హోంశాఖ ద్వారా డీవోపీటీకి పంపిస్తారని పోలీసువర్గాలు చెప్తున్నాయి. ఆ డీజీఐ అవినీతి నిరూపితమైతే కఠినచర్యలు తీసుకునే అవకాశం ఉన్నదని పేర్కొంటున్నారు.