హైదరాబాద్, సెప్టెంబర్ 14 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్లోని ముచ్చింతల్లో నెలకొల్పనున్న సమతా విగ్రహం (స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ) ఆవిష్కరణ కార్యక్రమానికి రావాలని రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతిని చినజీయర్స్వామి ఆహ్వానించారు. మంగళవారం ఆయన ఢిల్లీలో రాష్ట్రప్రతి రామ్నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడును కలిశారు. 216 అడుగుల సమతా విగ్రహాన్ని 2022 ఫిబ్రవరిలో ఆవిష్కరించనున్నారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. ఈ విగ్రహావిష్కరణ ద్వారా అంటరానితనాన్ని, వివక్షతను రూపుమాపి సమానత్వ సాధన కోసం కృషిచేసిన రామానుజుల సందేశాన్ని ప్రపంచవ్యాప్తంగా విస్తరించే అవకాశం ఉంటుందని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మైహోమ్ గ్రూప్ అధినేత జూపల్లి రామేశ్వర్రావు, ధనుష్ ఇన్ఫోటెక్ సీఎండీ డీఎస్ఎస్ మూర్తి పాల్గొన్నారు.