హైదరాబాద్, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ): పద్మవిభూషణ్, ప్రజాకవి కాళోజీ నారాయణరావు నిత్యం పరుల క్షేమం కోసం పరితపించారని సీఎం కే చంద్రశేఖర్రావు పేర్కొన్నారు. కాళోజీ సా హిత్యం.. తెలంగాణ యాసకు, భాషకు, భావుకతకు ప్రతీకగా నిలుస్తుందని కొనియాడారు. శుక్రవారం కాళోజీ జయం తి సందర్భంగా సీఎం ఆయనను స్మరించుకున్నారు. స్వాతంత్య్ర సమరయోధుడిగా, సామాజిక ఉద్యమకారుడిగా, కవిగా కాళోజీ సేవలు గొప్పవన్నారు. తెలంగాణ భాషకు, సాహిత్యానికి చేసిన కృషిని గౌరవిస్తూ కాళో జీ జయంతిని ‘తెలంగాణ భాషా దినోత్స వం’గా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నదని సీఎం తెలిపారు. తెలంగాణ భాష, సాహిత్య రంగాల్లో విశేష కృషిచేస్తున్న సాహితీవేత్తలను, కవులను, వైతాళికులను గుర్తించి, కాళోజీ పేరు మీద ప్రభుత్వం విశిష్ట పురసారాన్ని అందిస్తున్నదని చెప్పారు. ఈ సారి కాళోజీ పురసారాన్ని అందుకొంటున్న కవి, చరిత్రకారుడు శ్రీరామోజు హరగోపాల్కు సీఎం శుభాభినందనలు తెలిపారు.