హైదరాబాద్, అక్టోబర్ 12 (నమస్తే తెలంగాణ): ఛత్తీస్గఢ్లోని కాంగ్రెస్ ప్రభుత్వంపై అక్కడి ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. 2018 ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ సీఎం రమణ్సింగ్ నియోజకవర్గం రాజ్నంద్గావ్ ర్యాలీలో కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ పాల్గొన్నారు.
‘జన్ గోష్నా పత్రా’ పేరిట మేనిఫెస్టోని విడుదల చేశారు. కరెంటు బిల్లుల్లో 50 శాతం రాయితీ, అర్హులైన పేద మధ్యతరగతివారికి ఇండ్లు లేదా భూమి, ‘రాజీవ్ మిత్ర యోజన’ కింద రాష్ట్రంలోని 10 లక్షల మంది నిరుద్యోగ యువతకు నెల నెలా నిరుద్యోగ భృతి, ‘ఘర్ ఘర్ రోజ్గార్, హర్ఘర్ రోజ్గార్’ పథకం కింద నిరుద్యోగులకు శిక్షణ-ఉపాధి కల్పన, పేదలు, మధ్యతరగతికి ఉచిత వైద్యం తదితర హామీలు గుప్పించారు. అయితే ఐదేండ్లు గడిచినా ప్రధాన హామీలను ప్రభుత్వం నెరవేర్చలేదు.