హైదరాబాద్: దుండగుల దాడిలో గాయపడ్డ సిద్దిపేట జిల్లా చేర్యాల జెడ్పీటీసీ మృతిచెందారు. సికింద్రాబాద్లోని యశోదా హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరణించారని డాక్టర్లు తెలిపారు. కాగా, సోమవారం ఉదయం జిల్లాలోని గుర్జకుంట వద్ద వాకింగ్ చేస్తుండగా మల్లేశంపై దుంగడులు గొడ్డళ్లు, కత్తులతో దాడి చేశారు. దీంతో ఆయన తలకు తీవ్ర గాయాలవడంతో అపస్మారకస్థితిలోకి వెళ్లారు.
కుటుంబ సభ్యులు ఆయనను సిద్దిపేట ప్రభుత్వ దవాఖానకు తరలించారు. అయితే పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తీసుకువచ్చారు. అయితే చికిత్స పొందుతూ మల్లేశం మృతిచెందారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.