ప్రారంభమైన అథర్వణ వేద యాగం
ఇందూరు, ఏప్రిల్ 8: లోక కల్యాణార్థం తెలంగాణ వేదశాస్త్ర ప్రవర్తకసభ, శాక్తపరిషత్ ఆధ్వర్యంలో నిజామాబాద్లోని ఉమామహేశ్వరాలయంలో గురువారం చతుర్వేద సదస్సు, అథర్వణ వేదయాగం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఉద యం నుంచి సాయంత్రందాకా గురుప్రార్థన, గణపతి పూజ, పుణ్యాహవచనం, యాగశాల ప్రవేశం, అరణి మథన పూర్వక అథర్వణ వేదయాగ అగ్నిప్రతిష్ఠ, చతుర్వేద పరీక్షలు, నామ సంకీర్తన భజనలు కొనసాగాయి. మూడ్రోజులపాటు నిర్వహించను న్న ఈ కార్యక్రమానికి మధుసుదానంద సరస్వతీస్వామి హాజరయ్యారు. బ్రహ్మశ్రీ శాస్త్రుల వెంకటేశ్వరశర్మ, దెందుకూరి నారాయణ శ్రౌతి, విద్వాన్ నంబి వాసుదేవాచార్యులు ప్రవచనాలు చేశారు. కార్యక్రమం లో వేలేటి పశుపతిశర్మ, వేలేటి దుర్గ పరమేశ్వరశర్మ, చెరుకు ప్రసాద్శర్మ, పుల్లన్న ప్రవీణ్శర్మ, శ్రీహరిశర్మ, కిశోర్శర్మ, రాజవయ్యశర్మ తదితరులు పాల్గొన్నారు. వివిధ పాఠశాలల్లో వేదాలు అభ్యసించిన విద్యార్థులకు చతుర్వేద పరీక్షలు నిర్వహించారు. ప్రతిభ చూపినవారికి ధ్రువపత్రాలు అందజేయనున్నారు. పరీక్షా అధికారులుగా పల్లూరు మాణిక్య సోమయాజి, సూర్యనారాయణ ఘనాపాటి, కేదార్నాథ్ ఘనాపాటి, సామవేదం సుందరరామ, వేలేటి సిద్ధ రామేశ్వర వ్యవహరించారు. అనంతరం అథ్వరణ వేద పారాయణం చేయించారు.