ఈ ఏడాది కూడా వాట్సాప్ చాట్బోట్ యాప్ వినియోగించాలని
అధికారుల ఆదేశం ఇదే యాప్లో వర్క్షీట్ల నిర్వహణ
హైదరాబాద్, ఫిబ్రవరి 28 : విద్యార్థుల్లో ప్రశ్నల సాధనను అలవాటు చేసేందుకు పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకున్నది. విద్యార్థుల ప్రగతిని ఆన్లైన్లో అంచనా వేసేందుకు గతేడాదే వాట్సాప్ చాట్బోట్ యాప్ను అందుబాటులోకి తెచ్చింది. ఈ విద్యాసంవత్సరం సైతం ఈ యాప్ను వినియోగించాలని అధికారులు ఆదేశాలు జారీచేశారు. కరోనాతో చదువులు అంతంత మాత్రంగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో వాట్సాప్ ద్వారా విద్యార్థుల సామర్థ్యాలు, ప్రతిభను పరీక్షించేందుకు ఈ యాప్ దోహదపడుతున్నది. రాష్ట్ర విద్యాపరిశోధనా శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ) 1- 10 తరగతులవారికి సబ్జెక్టువారీగా వర్క్షీట్లను రూపొందించింది. వాటిని ఉపయోగించి, ఈ యాప్ ఆధారంగా విద్యార్థుల సామర్థ్యాలను పరీక్షించనున్నారు. ఈ యాప్లో ప్రాక్టీస్ చేసిన విద్యార్థుల వివరాలను ISMS పోర్టల్తో అనుసంధానిస్తారు. విద్యార్థులవారీగా, తరగతులవారీగా ప్రతిభను ఈ యాప్ ద్వారా అంచనావేయవచ్చని అధికారులు తెలిపారు. ఏవైనా సమస్యలు తలెత్తితే 011 -40747485 నంబర్ను సంప్రదించాలని సూచించారు.
ప్రక్రియ ఇలా..