శ్రీశైలం;మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీశైలంలో బుధవారం రథోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. గంగాధర మండపం వద్ద 11 రకాల పుష్పాలతో రథాన్ని అలంకరించి పూజలు చేశారు. అనంతరం స్వామి, అమ్మవారిని రథంపై ఆశీనులను చేసి ఆలయ ప్రధాన వీధిలో ఊరేగించారు. అనంతరం భ్రమరీ మల్లికార్జునస్వామికి తెప్పోత్సవాన్ని నిర్వహిం చారు. విద్యుద్దీపకాంతుల మధ్య పుష్కరిణిలో తెప్పపై విహరించిన ఆది దంపతులను వీక్షించేందుకు వివిధ ప్రాంతాల భక్తులు తరలివచ్చారు. మంగళ వాయిద్యాలు, కళాకారుల నృత్యాల మధ్య వేడుక కొనసాగింది.