హైదరాబాద్ : దుమ్మగూడెం ఆయుధాల కేసులో ఏడుగురు మావోయిస్టులపై జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) నాంపల్లి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసింది. ఇందులో ఏ-1గా ముత్తు నాగరాజు పేరును ఎన్ఐఏ ప్రస్తావించింది. కొమ్మరాజుల కనుకయ్య, సూరా సారయ్య, మద్వి హిడ్మా, కొయ్యాడ సాంబయ్య, మడకం కోసి, వల్లెపు స్వామి పేర్లను ఎన్ఐఏ చార్జిషీట్లో చేర్చింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో భారీగా పేలుడు పదార్థాలతో పాటు అందుకు సంబంధించిన అనేక పరికరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా కేసును ఎన్ఐఏ దర్యాప్తు చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో లైసెన్స్ ఉన్న వారి నుంచి జిలిటెన్ స్టిక్స్, కేబుల్స్, ఎలక్ట్రిక్ డిటోనేటర్లు, నాన్ ఎలక్ట్రిక్ డిటోనేటర్లు, ఫ్యూజ్ వైర్లను మావోలు కొనుగోలు చేశారు. మావోయిస్టు నేత హిడ్మా వద్దకు చేరవేసే క్రమంలో తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో పలువురు పోలీసులకు చిక్కారు. వాటితో ప్రజాప్రతినిధులు, పోలీసులపై దాడులు చేసేందుకు కుట్రపన్నినట్లు చార్జిషీట్లో పేర్కొన్నది.