హైదరాబాద్, జూలై 7 (నమస్తే తెలంగాణ): ఇంటర్మీడియట్ సెకండియర్ ఇంగ్లిష్ సిలబస్లో మార్పులు చేశారు. ఈ ఏడాది నుంచే కొత్త సిలబస్తో ఇంగ్లిష్ పుస్తకాలను ముద్రించారు. త్వరలోనే మార్కెట్లోకి రానున్నాయి. తన కార్యాలయంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి కొత్త ఇంగ్లిష్ పుస్తకాలను గురువారం విడుదల చేశారు. ఇంటర్ సెకండియర్ ఇంగ్లిష్లో ఫెయిల్ అయిన విద్యార్థులకు మాత్రం పాత సిలబస్ ప్రకారమే పరీక్ష నిర్వహించనున్నట్టు ఇంటర్ బోర్డు కార్యదర్శి ఉమర్ జలీల్ తెలిపారు. కార్యక్రమంలో విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ పాల్గొన్నారు.