హైదరాబాద్ : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు గాయం కావడం పట్ల టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన త్వరగా కోలుకోవాలని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదిక ద్వారా ప్రార్థించారు. గురువారం అర్ధరాత్రి కేసీఆర్ జారి కిందపడటంతో కాలుకు తీవ్ర గాయమైంది. వెంటనే ఆయనను సోమాజిగూడ యశోదా హాస్పిటల్కు తరలించారు. ప్రస్తుతం కేసీఆర్ వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ ఆరోగ్యంపై చంద్రబాబు (Chandra Babu) స్పందించారు.