హిమాయత్నగర్,ఏప్రిల్10: కేంద్రం తెచ్చిన రోడ్డు భద్రతా చట్టం ద్వారా ఫిట్నెస్ ధ్రువీకరణలో ఆలస్యమైన ఆటోలకు దినానికి రూ.50 చొప్పున జరిమానా విధించడాన్ని వ్యతిరేకిస్తూ 12న ‘చలో రాజ్భవన్’ నిర్వహిస్తున్నట్టు ఆటో, రిక్షా, క్యాబ్,లారీ సంఘాల జేఏసీ తెలిపింది. ఆదివారం హిమాయత్నగర్లోని ఎస్ఎన్రెడ్డి భవన్లో జేఏసీ సమావేశం నిర్వహించారు. జేఏసీ రాష్ట్ర నాయకులు బీ వెంకటేశం, (ఏఐటీయూసీ) ఏ సత్తిరెడ్డి (ట్రాన్స్ఫోర్ట్జేఏసి), వేముల మారయ్య (టీఆర్ఎస్కేవీ), మహ్మద్ అమానుల్లాఖాన్ (టీఏడీజేఏసీ) కిరణ్ (ఐఎఫ్టీయు), శ్రీకాంత్ (సీఐటీయూ) మాట్లాడారు.
రెండేండ్లుగా రవాణా వ్యవస్థ స్తంభించిపోవడంతో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని తెలిపారు. ఈ క్లిష్ట సమయంలో కేంద్రం ఆటోలపై జరిమానాలు విధించడం సరైన విధానం కాదని పేర్కొన్నారు. పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో ఆర్థిక భారం పడుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. 2019 రోడ్ సేప్టీ బిల్లును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. చలో రాజ్భవన్కు ఆటో కార్మికులు తరలిరావాలని జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు.