హైదరాబాద్, ఫిబ్రవరి 9 (నమస్తే తెలంగాణ) : చెరుకు ధర టన్నుకు రూ.5 వేలుగా నిర్ణయించాలని డిమాండ్తో ఏప్రిల్ 6న నిర్వహించనున్న చలో పార్లమెంట్ను జయప్రదం చేయాలని అఖిల భారత చెరుకు రైతుల ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు డీ రవీంద్రన్ పిలుపునిచ్చారు. గురువారం హైదరాబాద్ సుందరయ్య విజ్ఞానకేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, కేంద్రప్రభుత్వం 10.25 శాతం రికవరీ కోసం చెరుకు టన్ను ధర రూ. 3,050, 9.5 శాతం రికవరీకి టన్నుకు రూ.2,821 ధరను ప్రకటించిందని తెలిపారు.
చెరుకు ధరను కేవలం రూ.150, రికవరీ రేటును 0.25 శాతం పెంచి రైతులకు తీవ్రద్రోహం చేసిందని తెలిపారు. ఇది దేశవ్యాప్తంగా 5 కోట్ల మందికి పైగా చెరుకు రైతులు, 50 లక్షల మంది కార్మికులకు తీవ్ర నిరాశను మిగిల్చిందని పేర్కొన్నారు. సమావేశంలోరాష్ట్ర రైతు సంఘం సీనియర్ నాయకులు సారంపల్లి మల్లారెడ్డి, చెరుకు రైతుల సంఘం రాష్ట్ర కన్వీనర్ బొంతు రాంబాబు, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీ సాగర్, సహాయ కార్యదర్శి శోభన్ తదితరులు పాల్గొన్నారు.