ఉప్పల్, డిసెంబర్ 1: ఎస్సీ వర్గీకరణపై మోసం చేసిన బీజేపీకి బుద్ధి చెప్పేలా పోరాటాలు చేస్తామని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ అన్నారు. వర్గీకరణ సాధన కోరుతూ ఈ నెల 19న ‘చలో ఢిల్లీ-మాదిగల లొల్లి’ నిర్వహిస్తామని చెప్పారు. ఎస్సీ వర్గీకరణ సాధన డిమాండ్పై గురువారం హైదరాబాద్లో జరిగిన రాష్ట్రస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గతంలో కాంగ్రెస్, ప్రస్తుతం బీజేపీ ప్రభు త్వం మాదిగలను మోసం చేసిందని విమర్శించారు. కేంద్రమంత్రి కిషన్రెడ్డి పలు సభల్లో వర్గీకరణకు అనుకూలంగా మాట్లాడిన విషయం గుర్తు తెచ్చుకోవాలన్నారు. వర్గీకరణ బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టి, చట్టబద్ధత కల్పించే వరకు ఉద్యమిస్తామని ప్రకటించారు.