హైదరాబాద్, జూలై 11 (నమస్తే తెలంగా ణ): కాళేశ్వరం ప్రాజెక్టుతోనే తెలంగాణ సస్యశ్యామలమవుతున్నదని జలవనరుల అభివృ ద్ధి సంస్థ చైర్మన్ ప్రకాశ్ చెప్పారు. వర్షాలు పడకున్నా.. కర్ణాటక, మహారాష్ట్ర నుంచి ఇన్ఫ్లో రాకున్నా, నేడు నిజాంసాగర్ సజీవంగా ఉన్నదంటే కాళేశ్వరం జలాలతోనే సాధ్యమైందని తెలిపారు. ఇంజినీరింగ్ రంగ పితామహుడు నవాబ్ అలీ నవాజ్జంగ్ బహదూర్ 146వ జయంతి, 10వ ఇంజినీర్స్ డేను మంగళవారం జలసౌధలో ఘనంగా నిర్వహించారు. పలు శాఖల ఇంజినీర్లు నవాజ్జంగ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
ఇంజినీర్స్ డే సందర్భంగా నీళ్ల కోసం పని చే సే వారికి ఉత్తమ అవార్డులు ఇవ్వాలని, ఇం దుకు తనవంతుగా రూ.లక్ష ప్రకటించి, అక్కడికక్కడే చెక్కును అందజేశారు. ఈ సందర్భం గా పలువురు ఇంజినీర్లకు అవార్డులు అందజేశారు. కార్యక్రమంలో సీఎం ఓఎస్డీ శ్రీధర్రావు, రిటైర్డ్ ఇంజినీర్స్ ఫోరం అధ్యక్షుడు శ్యాంప్రసాద్రెడ్డి, ఎలక్ట్రిసిటీ ఇంజినీర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శివాజీ, రిటైర్డ్ ఇంజినీర్స్ సంఘం, నీటిపారుదలశాఖ, విద్యుత్తు, అండ్బీ శాఖల ఇంజినీర్స్ పాల్గొన్నారు.