కరీంనగర్ కమాన్చౌరస్తా, జూన్ 14: నీట్ యూజీ ఫలితాల్లో అల్ఫోర్స్ విద్యాసంస్థల విద్యార్థులు అద్భుత ఫలితాలు సాధించారని ఆ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ వీ నరేందర్రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా వావిలాపల్లిలోని కళాశాల ప్రాంగణంలో ఆయన విద్యార్థులను అభినందించి మాట్లాడారు. నీట్ కోచింగ్లో డాక్టర్స్-30 ప్రత్యేక ప్రోగ్రామ్ స్థాపించిన మొదటి ఏడాదిలోనే 14 మంది విద్యార్థులు ఎంబీబీఎస్ సీట్లు సాధించడం గర్వకారణమని తెలిపారు.
ఐదుగురు విద్యార్థులు 600కి పైగా మారులు, 36 మంది విద్యార్థులు 500పైగా, 66 మంది విద్యార్థులు 450కి పైగా మారులు సాధించడం అభినందనీయమన్నారు. సుమారుగా 80 మంది విద్యార్థులు వివిధ ప్రతిష్ఠాత్మక మెడికల్ కళాశాలల్లో సీట్లు సాధించగలరని చెప్పా రు. ఏటా అల్ఫోర్స్ విద్యార్థులు జాతీయ స్థాయిలో ర్యాంకులు సాధిస్తూ ముందంజలో ఉన్నారని తెలిపారు. పటిష్ట ప్రణాళికతో విద్యాబోధన, విద్యార్థుల అకుంఠిత దీక్ష, ఈ విజయం సాధ్యమైందని వివరించారు.