హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 17 (నమస్తే తెలంగాణ): రైతులకు ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలను చూపేందుకు కృషి చేస్తున్న సెంట్రల్ ఫుడ్ టెక్నలజికల్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ (సీఎఫ్టీఆర్ఐ).. పండ్లకు మార్కె ట్లో డిమాండ్ లేనప్పుడు వాటితో బనానా బార్లను ఉత్పత్తి చేసే విధానాన్ని తాజాగా అందుబాటులోకి తెచ్చింది.
దేశంలో అత్యధికంగా అరటి సాగయ్యే ఏపీ లాంటి రాష్ర్టాల రైతులకు ఇది ఎంతో మేలు చేకూరుస్తుంది. అరటి గుజ్జును బనానా బార్ తయారీకి ఉపయోగిస్తారు. అందులోని పోషకాలకు నష్టం వాటిల్లకుండా బనానా బార్ను తయారు చేసుకొని 6 నెలల వరకు నిల్వ చేసుకోవచ్చని పరిశోధకులు చెప్తున్నారు. బనానా బార్కు ఆకృతి, రంగు, నాణ్యతను బట్టి డిమాండ్ ఉంటుంది.