హైదరాబాద్, డిసెంబర్ 22 (నమస్తే తెలంగాణ): గురుకులాల్లో మ్యూజిక్ టీచర్ల పోస్టులకు సంబంధించిన అభ్యర్థులకు సోమవారం నుంచి సర్టిఫికెట్ వెరిఫికేషన్ను నిర్వహించనున్నారు. ఈ మేరకు ట్రిబ్ చైర్మన్ బడుగు సైదులు ఒక ప్రకటనలో తెలిపారు.
మాసాబ్ ట్యాంక్లోని డీఎస్ఎస్ భవన్లో సర్టిఫికేషన్ వెరిఫికేషన్ కొనసాగుతుందని, ఎంపికైన అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరుకావాలని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు అభ్యర్థులు <https://treirb.cgg.gov.in> వెబ్సైట్లో షెడ్యూల్ చూసుకోవాలని తెలిపారు.