హైదరాబాద్, ఫిబ్రవరి26 (నమస్తే తెలంగాణ) : ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ) పోస్టుల భర్తీకి అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ మంగళవారం నుంచి నిర్వహించనున్నట్టు ట్రిబ్ తెలిపింది. ఇప్పటికే ఇందుకు సంబంధించి సబ్జెక్టులవారీగా షెడ్యూల్ను ప్రకటించింది. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ, జనరల్ గురుకులాల్లో టీజీటీ పోస్టులు 4,020 ఉండగా, వీటి భర్తీకి ట్రిబ్ ఇప్పటికే పరీక్ష నిర్వహించింది. తాజాగా 1ః2నిష్పత్తిలో మెరిట్ జాబితాను విడుదల చేసింది.