హైదరాబాద్ : దుర్గాబాయ్ దేశ్ముఖ్ మహిళా సభ (డీడీఎంఎస్) (పాత ఏఎంఎస్)లో పలు సర్టిఫికెట్ కోర్సులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఫార్మసీ అసిస్టెంట్, హెల్త్కేర్ మల్టీపర్పస్ వర్కర్ (నర్స్ కోర్స్), ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్, ప్రీ ప్రైమరీ టీచర్ ట్రైనింగ్ తదితర కోర్సులను అందిస్తున్నట్లు చెప్పారు.
కనీసం పదవ తరగతి పాసైన అన్ని వయసుల వారు ఈ కోర్సుల్లో చేరేందుకు అర్హులని పేర్కొన్నారు. కోర్సును విజయవంతంగా పూర్తి చేసిన వారికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి సర్టిఫికెట్ అందజేస్తామని చెప్పారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ నెల 30వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇతర వివరాలకు 8008742542, 9490029846 నెంబర్లలో సంప్రదించాలన్నారు.