హైదరాబాద్, డిసెంబర్ 9 (నమస్తే తెలంగాణ): స్థాని క సంస్థల కోటాలో ఆరు స్థానాలకు శుక్రవారం ఎన్నికలు జరుగనున్నాయి. ఇందుకోసం ఏర్పాట్లు పూర్తిచేశామని సీఈవో శశాంక్ గోయల్ తెలిపారు. పోలింగ్ శుక్రవారం ఉదయం 8 నుంచి సాయంత్రం 4 వరకు కొనసాగుతుందని వెల్లడించారు. ఉమ్మడి మెదక్, ఆదిలాబాద్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో ఒక్కో స్థానానికి కరీంనగర్ జిల్లాలో రెండు స్థానాలకు పోలింగ్ జరుగుతుందని పేర్కొన్నారు. మొత్తం 37 పోలింగ్ కేంద్రా ల్లో, 5,326 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకొంటారని తెలిపారు. పోలింగ్ ప్రక్రియను వెబ్క్యాస్టింగ్ చేస్తున్నట్టు వెల్లడించారు. ఆదిలాబాద్లో ఇద్దరు ఓటర్లు పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారని గోయల్ చెప్పా రు. 14న ఓట్ల లెక్కింపు జరుగుతుందని తెలిపారు.
స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థుల విజ యం లాంఛనమే కానున్నది. మొత్తం 12 స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా.. అందులో ఆరింటిని టీఆర్ఎస్ ఇప్పటికే ఏకగ్రీవంగా కైవసం చేసుకొన్నది. మిగ తా ఆరుస్థానాలకు శుక్రవారం జరుగనున్న ఎన్నికల్లో సైతం టీఆర్ఎస్ విజయం ఖాయంగా కనిపిస్తున్నది. కనీసం పోటీచేసే అభ్యర్థిని ప్రతిపాదించేందుకు సైతం సభ్యులు లేని గడ్డు పరిస్థితి ఉన్నందున బీజేపీ పోటీ నుంచి ముందే తప్పుకున్నది. ఇక కాంగ్రెస్ తమకు సంఖ్యాబలం ఉన్నదని ఖమ్మం, మెదక్ స్థానాల నుంచి అభ్యర్థులను బరిలో నిలిపినా ఉన్న కొద్దిమంది కూడా టీఆర్ఎస్ శిబిరంలో చేరారు. మరికొందరు బయటకి కాంగ్రెస్ ఓటర్లుగా ఉన్నా పార్టీపరంగా ఉంటామే కానీ తమ ఓటును మాత్రం టీఆర్ఎస్కే వేస్తామనే సంకేతాలిచ్చినట్టు సమాచారం.