హైదరాబాద్ : ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగే జిల్లాల కలెక్టర్లతో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్ బుధవారం వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఈ నెల 10న స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగనున్నాయి. ఇప్పటికే ఆరు ఏకగ్రీవమైన విషయం విధితమే. మిగిలిన ఉమ్మడి ఆదిలాబాద్, మెదక్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో ఒక్కో స్థానానికి, కరీంనగర్ జిల్లాలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ జరుగనున్నది. ఇప్పటికే పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, సమస్యాత్మక కేంద్రాల గుర్తింపు, ఆయా ప్రాంతాలను బట్టి ప్రత్యేక చర్యలపై అధికారులతో సీఈఓ సమీక్షించారు. బుధవారం ఏర్పాట్లకు సంబంధించిన విషయాలపై మరోసారి చర్చించనున్నారు. ఈ నెల 10న ఎన్నికలు జరుగనుండగా.. 14న ఓట్ల లెక్కింపు జరుగనున్నది.