హైదరాబాద్, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ): రాష్ర్టాలపై కేంద్రం పెత్తనం రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతమని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ అన్నారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ సైతం ఇదే చెప్పారని గుర్తుచేశారు. శుక్రవారం రవీంద్రభారతిలో ఎస్సీ, ఎస్టీ మేధావుల జాతీయ ఫోరం నిర్వహించిన రాజ్యాంగ దినోత్సవ సభలో వినోద్కుమార్ మాట్లాడుతూ.. భారతదేశం ఫెడరల్ వ్యవస్థ అని, రాష్ర్టాల సమూహమని పేరొన్నారు. రాష్ట్రాల ఆర్థిక స్వావలంబనను కాపాడాల్సిన బాధ్యత కేంద్రంపై ఉన్నదని వివరించారు. రాజ్యాంగ స్ఫూర్తికి తూట్లు పొడుస్తూ, దేశ పాలకులు అనుసరిస్తునన ధోరణిని ఎండగట్టాల్సిన ఆవశ్యకత ఉన్నదని పిలుపునిచ్చారు. దేశంలోని ప్రభుత్వరంగ సంస్థలను నిర్వీర్యం చేయడం, ప్రైవేటీకరించడం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల ఉద్యోగావకాశాలను హరించే చర్యలు జోరుగా సాగుతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. కేంద్రం రాజ్యాంగంలోని సామ్యవాద భావనకు భిన్నంగా వ్యవహరిస్తున్నదని విమర్శించారు. రాజ్యాంగ హకులను కాపాడుకోవాల్సిన బాధ్యత పౌరులపై ఉన్నదని చెప్పారు.కార్యక్రమంలో బీసీ కమిషన్ చైర్మన్ వకులాభరణం కృష్ణమోహన్, ఎస్సీ, ఎస్టీ మేధావుల ఫోరం రాష్ట్ర చైర్మన్ ఆరేపల్లి రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.
రాజ్యాంగ ఫలాలు గ్రామాలకు చేరినప్పుడే రాజ్యాంగ స్ఫూర్తి వెల్లివిరుస్తుందని సుప్రీంకోర్టు న్యాయవాది పీ నిరూప్రెడ్డి పేర్కొన్నారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా గ్రామీణ న్యాయసేవల సంస్థ ‘లాప్’ (ల్యాండ్ అండ్ అగ్రికల్చర్ లాస్ ప్రాక్టీషనర్స్) నిర్వహించిన రౌండ్టేబుల్ సమావేశంలో సీనియర్ న్యావాదులు నిరూప్రెడ్డి, ఎం సురేశ్రెడ్డి మాట్లాడుతూ.. న్యాయ వ్యవస్థను గ్రామాలకు దగ్గర చేసేందుకు రూపొందించిన గ్రామ న్యాయాలయాల చట్టం ఇంకా అమలుకు నోచుకోకపోవడం శోచనీయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో లాప్ వ్యవస్థాపకుడు సునీల్కుమార్, మేనేజింగ్ పార్ట్నర్ అభిలాష్ పాల్గొన్నారు.