ఇచ్చోడ, జూన్ 12 : ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని ముక్రా(కే) పంచాయతీని కేంద్ర పంచాయతీరాజ్శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ ప్రశంసించారు. పల్లెప్రగతిలో భాగంగా చేపట్టిన అభివృద్ధి పనులు ఆదర్శంగా నిలుస్తున్నాయని శనివారం ట్విట్టర్లో పేర్కొన్నారు. గ్రామంలో కరోనా కేసులు నమోదు కాకపోవడం, నియంత్రణ కోసం తీసుకొన్న చర్యలు బాగున్నాయంటూ అభినందించారు. గ్రామంలో వ్యక్తిగత మరుగుదొడ్డితోపాటు సామూహిక మరుగుదొడ్లు, ఇంకుడుగుంతల నిర్మాణాలు, మొక్కల సంరక్షణకు చేస్తున్న కృషిని కొనియాడుతూ సర్పంచ్ మీనాక్షికి అభినందనలు తెలిపారు.