హైదరాబాద్ : కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుకు ఎంపికైన ప్రజాకవి, ఎమ్మెల్సీ గోరటి వెంకన్నకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శుభాకాంక్షలు తెలిపారు. గోరటి కలం నుంచి జాలువారిన ‘వల్లంకి తాళం’ పుస్తకానికి అవార్డు రావడం గర్వకారణం అన్నారు. సామాన్యుల జీవితాన్నే సాహిత్యంగా మలచి, పాటలుగా మార్చి ప్రజల్లో చైతన్యం తెచ్చిన గొప్ప వ్యక్తి గోరటి వెంకన్న అని ప్రశంసించారు.
వారు రాసిన అనేక పుస్తకాలు తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలను ప్రతిబింబిస్తాయని ఆమె తెలిపారు. గోరంటి వెంకన్నకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు రావడం మనందరికి గర్వకారణమని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు.