హైదరాబాద్: నాన్ బీజేపీ రాష్ట్రాల పట్ల కేంద్రం అనుసరిస్తున్న వైఖరిని మంత్రి కేటీఆర్(Minister KTR) తప్పుపట్టారు. ఇవాళ ఆయన తన ట్విట్టర్లో ఈ విషయాన్ని వెల్లడించారు. గవర్నర్ల వ్యవస్థను రద్దు చేయాలని అభిప్రాయపడుతూ తెలంగాణ ప్రభుత్వ డిజిటిల్ మీడియా డైరెక్టర్ కొణతం దిలీప్ చేసిన ట్వీట్ను మంత్రి కేటీఆర్ రీట్వీట్ చేశారు. ఆ ట్వీట్కు కేటీఆర్ తన కామెంట్ జోడించారు.
Sad state of affairs where top constitutional posts have become political tools in the hands of Union Govt
Have a look at all Non-BJP Governed states; you will see a similar clear pattern of Non-Cooperation & vengefulness
Is this the Cooperative Federalism model and Team India… https://t.co/kHtvnCjGKm
— KTR (@KTRBRS) April 11, 2023
దేశంలోని నాన్ బీజేపీ రాష్ట్రా(Non BJP States)ల్లో ఉన్న గవర్నర్ల తమ అధికారాలను నిర్ధాక్షిణ్యంగా దుర్వినియోగం చేస్తున్నారని, గవర్నర్(Governor)కు వ్యతిరేకంగా తమిళనాడు ప్రభుత్వం చేసిన తీర్మానాన్ని సమర్ధిస్తూ కొణతం దిలీప్ ట్వీట్ చేశారు. బ్రిటీష్ కాలం నాటి గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణ గవర్నర్ కూడా కొన్ని బిల్లులను పెండింగ్లో పెట్టిన విషయాన్ని ఆయన తన ట్వీట్లో పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ తన ట్విట్టర్లో స్పందిస్తూ.. దేశంలో ప్రజాపాలన చాలా బాధాకరంగా సాగుతోందన్నారు. రాజ్యాంగపరమైన ఉన్నత పదవుల్లో ఉన్నవారు.. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో రాజకీయ పావులుగా మారినట్లు ఆయన ఆరోపించారు. నాన్ బీజేపీ రాష్ట్రాలను ఓసారి గమనించండి అని, కేంద్రం ఆ రాష్ట్రాలకు సహకరించడం లేదని, ప్రతీకారేచ్ఛతో వ్యవహరిస్తోందని మంత్రి విమర్శించారు.
సహకార సమాఖ్య పాలనకు ఇదేమైనా మోడల్గా ఉంటుందా అని ఆయన ప్రశ్నించారు. టీమ్ ఇండియా స్పూర్తిని దెబ్బతీసేలా కేంద్ర వైఖరి ఉందని, ఇది దేశ ప్రగతికి, సామరస్యానికి ఏ విధంగా దోహదపడుతుందని మంత్రి కేటీఆర్ తన ట్వీట్లో అడిగారు.