వరంగల్ : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నదని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. యాసంగి వడ్లను కేంద్రం కొనుగోలు చేయాలనే డిమాండ్ తో వరంగల్- ఖమ్మం హైవేపై రాయపర్తి మండల కేంద్రం వద్ద టీఆర్ఎస్ ధర్నాలో మంత్రి పాల్గొన్నారు.
కేంద్రం యాసంగి వరి ధాన్యాన్ని కొనేవరకు ఆందోళనలు చేపడుతామన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఇతర స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.