హైదరాబాద్, ఫిబ్రవరి 16 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో త్వరలో ఖాళీ కానున్న రెండు శాసనమండలి (ఎమ్మెల్సీ) స్థానాల భర్తీకి కేంద్ర ఎన్నికల సంఘం గురువారం నోటిఫికేషన్ జారీ చేసింది. నామినేషన్ల స్వీకరణకు ఈ నెల 23వ తేదీ వరకు అవకాశం కల్పించింది. మార్చి 13న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్ జరుగనున్నది. 16న ఓట్లను లెక్కించి ఫలితాలు వెల్లడించనున్నది.
మహబూబ్నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ టీచర్ ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్దన్రెడ్డి పదవీకాలం మార్చి 29తో, హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ సయ్యద్ హసన్ జాఫ్రీ పదవీకాలం మే 1తో ముగియనున్నది. దీంతో ఈ రెండు స్థానాల భర్తీకి కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది.